జగన్ సర్కారుపై హిందూపురం తహసీల్దార్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల సేకరణలో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ గుర్తించామని, అయితే.. ప్రజలకు అందుబాటులో ఉండే చోట స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తామని, డబ్బులు ఇవ్వకుండా ఇళ్ల స్థలాలు కావాలంటే ఎలా వస్తాయి? అని ఆయన ప్రశ్నించారు.