పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్ల ద్వారా నిరసన తెలియజేస్తున్నారు. సోమవారం నామినేషన్లకు చివరి తేదీ కావడంతో.. జగిత్యాల, మెట్పల్లి, నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే 50 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయగా.. నేడు మరికొంతమంది రైతులు నామినేషన్లు వేయడానికి వచ్చారు. దీంతో నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద పరిస్థితి కొంత ఉద్రిక్తతను తలపించింది. పోలీసులు అక్కడి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.