కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్లోని సురేందర్ నగర్ లో జన ఆక్రోష్ పేరిట ఏర్పాటు చేసిన ప్రచార సభలో హార్దిక్ పటేల్ ప్రసంగిస్తుండగా, వేదికపై దూసుకువచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి అతని చెంప ఛెళ్లు మనిపించాడు. దీంతో ఒక్క సారిగా సభా స్థలిలో గందరగోళం చోటుచేసుకుంది. అనంతరం హార్దిక్ పటేల్ పై దాడి చేసిన వ్యక్తిని చుట్టుముట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు నిందితుడిని చితకబాదారు. అయితే నిందితుడు ఎవరనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది