లోక్సభ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీజేపీ గెలవబోతోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేశారు. తుది విడత ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మోదీ..న్యూస్ 18తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ప్రతి సభలోనూ ''మోదీయే గెలుస్తారు'' అనే నినాదం ప్రతిధ్వనిస్తోందని.. బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టంచేశారు. బీజేపీతో పాటు మిత్రపక్షాల సీట్లు కూడా పెరగబోతున్నాయని జోస్యం చెప్పారు ప్రధాని.