అక్బరుద్దీన్, కేసీఆర్ భేటీ వెనుక కుట్ర ఉందన్నారు ఘోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎంఐఎం అక్బరుద్దీన్కు సీఎంయే ఈ సలహా ఇచ్చారని ఆరోపణలు చేశారన్నారు. అక్బరుద్దీన్ హిందువులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే తర్వాతే హిందూ దేవాలయాలపై నిధులు కోరాలన్నారు. మేం ఫోన్ చేసినా, మెయిల్ చేసినా సీఎం స్పందించరు కానీ... ఎంఐఎం ఎమ్మెల్యేతో మాత్రం మీటింగ్ అవుతారని ఆరోపణలుచ చేశారు రాజా సింగ్.