అమరావతి ప్రాంతంలో ఉన్న వెంకటపాలెంలోని రామాలయంలో ఈ రోజు ధ్వజస్తంభాన్ని పున:ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో రైతుల, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాలయ పరిసరాలు జై శ్రీరాం.. జై అమరావతి నినాదాలతో మార్మోగింది. రాముడికి పూజలు చేసి, ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచేలా సీఎం జగన్ మనసు మార్చాలని రైతులు దేవుడ్ని వేడుకున్నారు.