ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసదుద్దీన్ ప్రమాణం చేయడానికి వచ్చే సమయంలో బీజేపీ సభ్యులు జై శ్రీరాం, వందేమాతరం నినాదాలతో హోర్తెతించారు. వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన ఓవైసీ... ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం జై భీమ్, జై హింద్ అంటూ ముగించారు.