కేరళను వర్షాలు ముంచేత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ చిగురుటాకులా వణుకుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలు తీవ్రం అవ్వడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో కాసర్గడ్ జిల్లాలోని మధుర్ శ్రీ వినాయక దేవాలయంలోకి కూడ వరద నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సామాన్యుల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు.