గతకొన్ని మాసాల హైడ్రామాకు తెరదించుతూ 2012నాటి నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులను తీహార్ జైల్లో ఉరితీశారు. ఇవాళ ఉదయం 5.30 గం.లకు నలుగురు రేపిస్టులకు ఉరిశిక్షను అమలుచేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వారికి ఉరిశిక్షను అమలుచేయడం పట్ల నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. తమ కుమార్తె నిర్భయకు న్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పు మహిళల విజయం తెలిపారు.