అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తుండటంతో... అహ్మదాబాద్లోని మోతేరా క్రికెట్ స్టేడియంకి అభిమానులు తరలివస్తున్నారు. చాలా మంది ఆధార్ కార్డు తెచ్చుకుంటున్నారు. స్టేడియంలోకి తమను అనుమతిస్తారో లేదో అన్న అనుమానంతో వాళ్లు ఆధార్ కార్డు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం స్డేడియం మొత్తం హై సెక్యూరిటీతో ఉంది. వచ్చే ప్రజలను గ్యాలరీల్లో కూర్చోబెడుతున్నారు.