హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఆర్మీ ట్రక్ హైవేపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ జవాన్ మృతి చెందగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం సిమ్లా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్ బేస్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జవాన్ రాజేష్ వయసు (35) మృతిచెందగా, గాయపడిన వారిలో సూరజన్ (35), బికె రాయ్ (35), నాగప్ప (35) ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు.