గోవా... పనాజీలో ప్రారంభమైన కార్నివాల్ 2020 చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. విదేశాల్లో ఎలా నిర్వహిస్తారో అలాగే మన దేశంలోనూ నిర్వహిస్తుండటం గొప్ప విషయం. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ కార్నివాల్ను ఫిబ్రవరి 22న ప్రారంభించారు. కళాకారులు రకరకాల వేషాల్లో కనిపిస్తూ... అలరిస్తూ... పర్యాటకులకు మర్చిపోలేని జోష్ కలిగించారు.