ఢిల్లీ ఎయిర్పోర్టులో ఓ అనుమానాస్పద బ్యాగ్ ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. గత రాత్రి ఒంటిగంట సమయంలో ఎయిర్పోర్ట్లోని మూడు టెర్మినల్ వద్ద ఒక బ్యాగ్ పడి ఉన్నట్లు సమాచారం అందడంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది దాన్ని వేరే చోటుకు తరలించి, తెరిచి చూడగా అందులో విద్యుత్తు తీగలు ఉన్నట్లు తేలింది. ఈ ఘటనతో చాలా సేపు ఆ టెర్మినల్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. తనిఖీలు నిర్వహించిన అనంతరం ఉదయం నాలుగు గంటలకు రాకపోకలకు అనుమతి ఇచ్చారు.