రైల్లో అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను భువనేశ్వర్ డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. జ్ఞానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్ప్రెస్ రైల్లో రూ.5 కోట్ల విలువైన 12 కేజీల గోల్డ్ బిస్కెట్లు తరలిస్తుండగా అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంలో రంగంలోకి దిగిన అధికారులు రూర్కెలా, ఝార్సుగూడ మధ్య స్మగర్లను అదుపులోకి తీసుకున్నారు.