ఏపీలో లాగే... తమిళనాడులో ప్రజలు కూడా జల్లికట్టుకు ముందు... కోడి పందేలు నిర్వహిస్తున్నారు. జనవరి 16న ఇవి పెద్ద ఎత్తున జరగనున్నాయి. వద్దో అంటుంటే వినిపించుకోకుండా కోళ్లకు కత్తులు కడుతున్నారు. మధురై జిల్లాలో ఈ పొంగల్ వేడుకలు బాగా జరుగుతున్నాయి. అక్కడి వేర్వేరు ప్రాంతాల్లో పందెం కోళ్లను బరిలోకి దింపుతున్నారు. ప్రస్తుతం కోళ్లకు ఫైనల్ ట్రైనింగ్ నడుస్తోంది. 16న అసలు యుద్ధం మొదలవుతుంది.