20th Kargil Vijay Diwas : కార్గిల్ యుద్ధం జరిగి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా... దేశవ్యాప్తంగా అమర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు. 20వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నేషనల్ వార్ మెమరియల్ దగ్గర అమర సైనికులకు నివాళులు అర్పించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశ చరిత్రలో మర్చిపోలేని ఘట్టాల్లో ఒకటి కార్గిల్ యుద్ధం. ఆ యుద్ధంలో పాకిస్థాన్తో వీరోచితంగా పోరాడి విజయం సాధించింది భారత సైన్యం. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 20 ఏళ్లు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అమర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు.