ఈ నెల 14, 15 తేదిల్లో ఇటలీలోని లేక్కోమోలో దీపికా, రణ్వీర్ సింగ్ల వివాహం జరిగింది తెలిసిందే. వారీ పెళ్లిని మొదట కొంకణి సంప్రదాయ పద్ధతిలో, తర్వాత సింధీ సంప్రదాయ పద్దతిలో జరిపారు. అయితే ఇప్పుడు దీప్వీర్ల వివాహానికి సంబంధించిన రిసెప్షన్ బుధవారం బెంగళూరులో జరగనుంది. అందులో భాగంగా బెన్సన్టౌన్లోని దీపికా ఇంటిని విద్యుత్ దీపాలతో అద్బుతంగా అలంకరించారు. దీపికా కుటుంబ సభ్యులు ఇచ్చే ఈ వివాహా విందుకు బాలీవుడ్తో పాటు అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు హాజరు కానున్నారు.