తెలుగు హీరో వెంకటేష్ తిరుమల వెంకన్న ఆశీస్సుల కోసం తిరుపతి వచ్చారు. ఈ రోజు వేకువ జామున సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నటుడు వెంకటేష్ను ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి లడ్డు ప్రసాదాలను అందచేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా వుందంన్నారు వెంకటేష్.అందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు వెంకటేష్ తెలిపారు .