రష్యా రాజధాని మాస్కోలో పెను ప్రమాదం తప్పింది. విమానం ఇంజిన్లో పక్షులు చిక్కుకోవడంతో సమీపంలో ఉన్న మొక్కజొన్న తోటలో ఫ్లైట్ని ల్యాండ్ చేశారు పైలట్లు. ఈ ప్రమాదంలో 23 మందికి గాయాలయ్యాయని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... ఉరల్ ఎయిర్లైన్స్కు చెందిన A321 విమానం గురువారం ఉదయం జుకోస్కి ఎయిర్పోర్టు నుంచి సింఫరోపోల్ ఎయిర్పోర్టుకు బయలుదేరింది. ఆ విమానంలో 226 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు.