విజయవాడలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాల్ మనీ భూతానికి మరో నిండు ప్రాణం బలి అయ్యింది. కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలువలో దూకి ప్రేమ్ ఆత్మహత్య. నాలుగున్నర లక్షలు అప్పు తీసుకున్న ప్రేమ్... వడ్డీతో సహా ఇప్పటివరకు 16 లక్షలవరకు చెల్లించాడు. అయినా కాల్ మనీ నిర్వహకులు వేధింపులు తగ్గలేదు.దీంతో ఏం చేయాలో అర్థంకాక ఆత్మహత్యకు ప్రేమ్ కుమార్ యత్నించాడు.