రైల్లో స్టంట్ చేస్తూ కిందపడిపోయిన యువకుడి వీడియో ఒకటి టిక్ టాక్లో వైరల్గా మారింది. ఈ వీడియోపై తాజాగా కేంద్రరైల్వే మంత్రి పీయూష్ గోయెల్ స్పందించారు. ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేసిన మంత్రి.. రైలు ప్రయాణికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ట్రైన్లో స్టంట్ చేయడం ధైర్యానికి చిహ్నం కాదు.. మూర్ఖత్వమని అన్నారు. జీవితం చాలా విలువైనదని... దయచేసి దాన్ని ప్రమాదంలో పడేయకండని విజ్ఞప్తి చేశారు. రైల్వే నియమాలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని సూచించారు.