టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ను మూడ్రోజులుగా సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రకరకాలుగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతున్నారు. నకిలీ, ఫోర్జరీ పత్రాల కేసులో రవిప్రకాష్పై అలంద మీడియా ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి, 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. దాంతో రవిప్రకాష్ సైబరాబాద్ క్రైమ్ పోలీసుల ముందు మూడ్రోజులుగా హాజరవుతున్నారు.