హైదరాబాద్ శివారులోని మౌలాలీ రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న రైలులో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఓ బోగీ మొత్తం కాలి పోయింది. వెంటనే సమాచారం అందుకున్న ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలు ఆపేశారు. అయితే, ప్రమాదం సమయంలో రైలులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.