గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చోరీ జరిగింది. ఆదివారం రోజు అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని జనరిక్ మందుల దుకాణంలో ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. 15 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.