పండగ వేళ హైదరాబాద్లోని పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా కొందరు మెరుపు ధర్నాకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ను వ్యాప్తి చేశారు. ఈ సందేశం పోలీసులకు చేరడంతో అలర్టైన పోలీసులు రంగంలోకి దిగారు.