దంతెవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో ఇద్దరు జవాన్లు, ఓ దూరదర్శన్ కెమెరామన్ చనిపోయినట్టు డీఐజీ (నక్సల్ ఆపరేషన్స్) సుందరరాజ్ ప్రకటించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడినట్టు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పెట్రోలింగ్కు వెళ్లిన వారు తిరిగి వచ్చిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు.