రంగారెడ్డి జిల్లా తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. పోలం రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సురేష్ అనే రైతును ఆమె లంచం అడిగినందుకే పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఆఫీసులోనే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనకు కూడా నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.