సంగారెడ్డి శివారులోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. ఒకే వైపు వెళ్తున్న రెండు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. కాగా రెండు లారీల మధ్య నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఇరుక్కుపోయాడు. అయితే ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు లేకుండా అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. రెండు లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేసి రోడ్డుపై నుంచి లారీలను తొలగించారు. రెండు లారీలు ఢీకొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.