హైదరాబాద్ శివారులోని మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన పశువుల వ్యర్థాలతో సబ్బులు తయారుచేస్తున్న వైనం వెలుగుచూసింది.ఎస్వోటి పోలీసులు అక్కడ దాడులు జరిపి ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. కంపెనీని సీజ్ చేశారు.ఆ సబ్బుల నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(పీసీబీ) అధికారులకు పంపించారు.