కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామ శివారులో ఓ బైక్ను వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే బైక్పై దంపతుల కవల పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఆ ఇద్దరు పిల్లలు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. దంపతుల దుర్మరణంతో వారి పిల్లలు అనాథలయ్యారు.