అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన ఈబూతి లక్ష్మయ్య,భాగ్యమ్మ దంపతుల కుమార్తె చెంచులక్కకు అదే గ్రామానికి చెందిన బాలన్న-లక్ష్మీదేవి దంపతుల మూడో కుమారుడు గోపాల్తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహమైన మరుసటిరోజు నుంచే అదనపుకట్నం వేధింపులు మొదలయ్యాయి. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆమెపై దాడి చేసిన గోపాల్ గొంతు నులిమి ఆమెను హత్య చేశాడు.