శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్ సర్వీస్ ఆఫీస్ ఒకరు భారీ మొత్తంలో బంగారం తరలిస్తున్నాడన్న సమాచారంతో అతన్ని తనిఖీ చేశారు. రూ.1,84,88,736కోట్ల విలువ చేసే 4891 గ్రాముల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమర్ సర్వీస్ ఆఫీసర్తో పాటు మరో ఇద్దరు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.