హైదరాబాద్ అంబర్పేట్ పరిధిలో ఉన్న మూసీ నదిలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.స్థానికులు గమనించి డీఆర్ఎస్ బృందానికి సమాచారం అందించడంతో.. మూసీలో గాలింపు చర్యలు చేపట్టారు.అతన్ని కాపాడటం కోసం జీహెచ్ఎంసీ డీఆర్ఎస్ బృందాలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అవేవి సఫలం కాలేదు.ఎట్టకేలకు అతని మృతదేహం మాత్రం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడా..? లేక మరేదైనా కోణం ఉందా..? అన్నది కూడా తెలియాల్సి ఉంది.