ఆన్లైన్ మార్కెట్ విస్తరిస్తుంటే... అప్పుడప్పుడూ నేరాలు కూడా అలాగే జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా... సత్తుపల్లి పట్టణం పాత సెంటర్లో అమృత సురేష్ సెల్ వరల్డ్ షాపు యాజమాని... ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్లో రెడ్ మీ Y3 మొబైల్ కోసం ఆర్డరిచ్చాడు. రూ.11,999 రూపాయలు చెల్లించాడు. తీరా ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే... అందులో మొబైల్కి బదులు రెండు నిర్మా సబ్బులు రావటంతో షాపు యాజమాని షాక్ అయ్యాడు.