కర్నూలులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ.శివప్రసాద్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన నివాసంతో పాటు బంధువులు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. బెంగళూరులో రూ. 6 కోట్ల విలువైన ఏడు అంతస్తుల అపార్ట్మెంట్, మరో ఇండిపెండెంట్ హౌస్కు సంబంధించిన పత్రాలు లభించాయి.