ఉత్తరప్రదేశ్... మొరాదాబాద్లో జరిగిందీ ఘటన. ఓ మహిళ, మరో కేటుగాడు కలిసి... గల్షాహీద్ బస్టాండ్ దగ్గర తల్లి పక్కన నిద్రపోతున్న 8 నెలల పాపను సైలెంట్గా ఎత్తుకుపోయారు. గంట తర్వాత నిద్ర లేచిన తల్లి షాకైంది. చుట్టుపక్కల అందర్నీ అడిగింది. ఎవరూ తమకు తెలియదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి... సీసీ ఫుటేజ్ చూడగా... అసలు విషయం తెలిసింది. ఇప్పుడా మహిళ, కేటుగాడి కోసం పోలీసులు వెతుకుతున్నా్రు.