మధ్యప్రదేశ్లోని నర్సింగాపూర్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్లో దొంగతనానికి విఫలయత్నం చేశాడో దుండగుడు. మాస్కు ధరించి, చేతిలో తుపాకి పట్టుకొని బ్యాంకులోని ప్రవేశించిన దుండగుడు.. తుపాకితో బెదిరించి డబ్బు సంచిలో పెట్టాలని క్యాషియర్ను హెచ్చరించాడు. అప్రమత్తమైన క్యాషియర్ వార్నింగ్ బెల్ మోగించడంతో భయపడ్డ దుండగుడు అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. దీనికి సంబంధించిన ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.