గుంటూరు జిల్లాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం కురు నూతల దగ్గర అదుపుతప్పి టవేరా కారు వాగులో పడింది.