నాగర్ కర్నూల్ జిల్లా పెద్దూరుకు చెందిన సామ శరత్ కుమార్ వనపర్తి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ పనిచేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పి గ్రామస్తులతో కలిసి స్కూల్కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో తాగిన మత్తులో తాను ఆ పని చేశానని ఒప్పుకోవడంతో చితకబాదారు.