కరోనా వైరస్ సమయంలో పోలీసులు తమ గొప్పమనసును చాటుకున్నారు. యూపీలోని షహరాన్పూర్ జిల్లాలో ఉన్న కిషన్పూర్ గ్రామంలో ఓ వితంతువు అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమెకు చికిత్స అందించాలంటూ ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. అనాధ అయిన ఆ మహిళకు పోలీసులే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు పాడె మోశారు. అనంతరం దహనసంస్కారాలు చేపట్టారు.