కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో కొవ్వొత్తి వెలిగించారు. సరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్ బల్బులను ఆర్పి, కొవ్వొత్తి వెలిగించి సంఘీభావం ప్రకటించారు. ప్రగతిభవన్లో మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు కూడా కొవ్వొత్తులు వెలిగించారు.