సామాజిక అంశాలపై స్పందిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా అంటే ప్రజల్లో భయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కరోనా భయం వద్దని, జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటూ సైకత శిల్పాన్ని రూపొందించాడాయన.