ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంటే...మన దేశం మాత్రం ధీటుగానే సమాధానం చెబుతుంది. కీలక సమయంలో ప్రధాన మోడి తీసుకున్న నిర్ణయం వలన చాలా వరకు దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టగలిగాం అంటున్నారు ప్రముఖ డాక్టర్ అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికి దేశంలో కరోనా వ్యాప్తి గణనీయంగానే ఉందనే అయితే కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చునని అంటున్నారు వైధ్యనిపుణులు.
ప్రస్తుతం జనాలు పాటిస్తోన్న సోషల్ డిస్టేన్స్ చాలా మంచి ఆయుధమని అంటున్నారు. దీని వలన వైరస్ వ్యాప్తి అనే చైన్ ను నిలునుదల చేయడం చాలా మంచి విషయం అయితే ప్రజలు కూడా కాస్త సీరియస్ గా తీసుకోని లాక్ డౌన్ ను పాటించాలి అంటున్నారు. కరోనాకు మందు నిజంగానే లేదని అయితే మంది మార్కెట్ లో కి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉటుందని అభ్రిపాపడుతున్నారు ప్రముఖ డాక్టర్ ప్రభు కుమార్. చాలా మంది రాజకీయ నాయుకులు చెప్పినట్లు కరోనా పారాసిటమల్ తో తగ్గిపోతుందనే దాంట్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు.అసలు పారాసీటమల్ తో ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి మాత్రమే తగ్గుతుందని అయితే కరోనా పారాసిటమల్ తో తగ్గదని ఆయన తెలిపారు.