పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని కంటెన్న్మెంట్ జొన్లలో పర్యటించారు. ఖైరతాబాద్ పరిధిలోని సిఐబి క్వార్టర్స్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి కంటెన్న్మెంట్ జొన్లను మంత్రి కే. తారకరామారావు సందర్శించి అక్కడి వున్న ప్రజలతో మాట్లాడారు. మరింతగా ప్రజలు వైరస్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని పరిమితులును విధించిందని, అందులో భాగంగానే ఈ కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేసిందని తెలిపారు.