కామారెడ్డిలో ఓ ఆర్మీ జవాన్కు కరోనా లక్షణాలు కనిపించాయి. జ్వరం, దగ్గు, జలుబు రావడంతో పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి జవాన్ వెళ్లాడు. ఐతే కరోనా ఉందేమోనన్న అనుమానంతో అక్కడి వైద్యులు కోవిడ్-19 పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సదరు జవాన్ ఇటీవలే ఢిల్లీ నుంచి కామారెడ్డికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.