కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న లాక్డౌన్ మరికొద్ది గంటల్లో పూర్తి కాబోతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. అంతకుముందు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వీడియో సందేశాన్ని పంపించారు. ప్రజలను ఉద్దేశించి ఆమె 5 నిమిషాల 45 సెకన్ల పాటు మాట్లాడారు.