ఢిల్లీలో సదస్సుకు హాజరైన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారికి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసుల డేటాను, వైద్య సిబ్బంది డేటాను, అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే డేటాను వీటన్నింటిని విశ్లేషించుకుని ఆ మేరకు వైద్య పరీక్షల విషయంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. ఢిల్లీలో జమాత్కు 1085 మంది హాజరయ్యారని... వీరిలో మన రాష్ట్రంలో ఉన్నవాళ్లు 946 మందిని గుర్తించామని అధికారులకు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ 946 మందిలో 881 మంది ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి ఫలితాలు వచ్చాయని, వీరిలో 108 మంది పాజిటివ్గా కేసులుగా నిర్ధారణ అయ్యారని వివరించారు. ఇంకా 65 మందికి సంబంధించి ల్యాబ్ నుంచి ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు.