ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ హల్చల్ చేశారు. బెంగళూరు నుంచి ఐదు కార్లలో ఏపీ సరిహద్దుల్లోకి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్... తమను రాష్ట్రంలోకి అనుమతించాలని పోలీసులను కోరారు. ఆయనతో పాటు ఆయనకు సంబంధించిన వాహనాల్లో 39 మంది బంధువులు కూడా ఉన్నారు. అయితే వీరిని చీకలబైలు చెక్పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఎవరినీ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే వాహనం తిరుపతి చేరుకున్నట్టు సమాచారం.అయితే ఇప్పటికీ చెక్ పోస్ట్ దగ్గరే ఉన్న ఎమ్మెల్యే బంధువుల వాహనాలు ఉండిపోయాయి.