విశాఖలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. యస్. రాయవరం మండలం సోమదేవపల్లి గ్రామంలో వరహానది ఉదృతంగా ప్రవహిస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరద నీరు నదిలోకి వచ్చి చేరింది. దీంతో నది గట్టు కోతకు గురికావడంతో నూకాలమ్మ ఆలయం నదిలో కొట్టుకుపోయింది. కళ్ళ ముందు ఆలయం నది ప్రవహంలో మునిగిపోవడంతో ప్రజలు తల్లడిల్లిపోయారు.