విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగే లాయర్ల ధర్నాకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. సచివాలయానికి వెళ్లే మార్గాలు, చుట్టుపక్కల గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ముళ్లకంచెలు, బారికేడ్లను భారీగా ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.